జమ్మూ కాశ్మీర్లో 3.2 తీవ్రతతో భూప్రకంపనలు

X
By - TV5 Telugu |15 Jun 2020 6:03 PM IST
సోమవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లో 3.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించిందని, అయితే ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4.36 గంటలకు ఐదు కిలోమీటర్ల లోతులో భూప్రకంపన సంభవించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే పెద్దగా ప్రమాదం ఏమి లేకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com